మకర సంక్రాంతి

సప్తాశ్వములతో విరాజిల్లే ఓ సప్తమీ! నువ్వు అన్ని లోకాలకు మాతృకవు. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణప్రదాత ఐన సూర్యుడిని ఈ లోకానిని అందించిన జననివి. నీకివే నమస్కారాలంటూ మకర సంక్రాంతి నాడు ప్రజలు సూర్యుని నమస్కరించుకుంటారు. ఈ రోజు దేవ, పితృపూజలకు మంచిరోజు, స్నాన, దాన, పూజాదులను చేయాలి. ఈ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందుకు మహాభారతంలోని కథనే ఉదాహరణగా చెబుతుంటారు.
ద్రోణుడు, ఆయన భ్యార కృపి ఆశ్రమంలో ఉంటూ దైవచింతననలో గడుపుతుండేవారు. ఒకరోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్లగా, ఆస్రమలో కృపి మాత్రమే ఉంది. అప్పుడు సమిధల కోసం వెదుక్కుంటూ దుర్వాసముని అక్కడు వస్తాడు. తమ ఆశ్రమానికి వచ్చిన దూర్వాసుని సాదరంగా ఆహ్వానించిన కృపి, ఆయనకు సేవలు చేసి, తమ పేదరికాన్ని గురించి చెబుతూ, ఒక ముసలి ఆవు తప్ప ప్రపంచంలో మరే ఆస్తి లేదని, చివరకు పిల్లలు కూడా లేరని, ఇందుకు ఏదైనా మార్గాన్ని సూచించమని ప్రాధేయపడింది. ఆమె కష్టాలను విన్న దుర్వాసుడు, పూర్వం యశోద సంక్రాంతి పండుగనాడు స్నానం చేసి బ్రాహ్మణునికి పెరుగుదానం చేసి శ్రీకృష్ణుని కొడుకుగా పొందిందనీ, ఆమెను అలా చేయమన్నాడు.
వీరిలా మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజే సంక్రాంతి పండుగ అన్న విషయం గుర్తుకు తెచ్చుకున్న దుర్వాసుడు, కృపిని వెంటనే దగ్గరున నదికెళ్ళి నువ్వులపిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. అనంతరం తనకు పెరుగు దానం చేస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. కృపి దుర్వాసుడు చెప్పినట్లుగా చేస్తుంది. కొంతకాలానికి ఆమెకు ఓ కొడుకు పుడతాడు. అతడే ఆశ్వత్థామ.
ఈ రోజున ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, బంగారం, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరుక, గోవు మొదలైనవాటిని దానం చేయాలని అంటారు. ఈ రోజున శివుని ముందు నువ్వల దీపాన్ని వెలిగించడం, నువ్వులూ, బియ్యం కలిపి సిఉని పూజించడం చేయాలి. ఈ రోజున నువులను ఏదో ఒక రూపములో తినాలని అంటారు. శివునికి ఈరోజున ఆవునేతితో అభిషేకం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. ఈరోజున గుమ్మడికాయను కూరలో ఉపయోగించుకోవడం మంచిది.

సప్తాశ్వములతో విరాజిల్లే ఓ సప్తమీ! నువ్వు అన్ని లోకాలకు మాతృకవు. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణప్రదాత ఐన సూర్యుడిని ఈ లోకానిని అందించిన జననివి. నీకివే నమస్కారాలంటూ మకర సంక్రాంతి నాడు ప్రజలు సూర్యుని నమస్కరించుకుంటారు. ఈ రోజు దేవ, పితృపూజలకు మంచిరోజు, స్నాన, దాన, పూజాదులను చేయాలి. ఈ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందుకు మహాభారతంలోని కథనే ఉదాహరణగా చెబుతుంటారు.
ద్రోణుడు, ఆయన భ్యార కృపి ఆశ్రమంలో ఉంటూ దైవచింతననలో గడుపుతుండేవారు. ఒకరోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్లగా, ఆస్రమలో కృపి మాత్రమే ఉంది. అప్పుడు సమిధల కోసం వెదుక్కుంటూ దుర్వాసముని అక్కడు వస్తాడు. తమ ఆశ్రమానికి వచ్చిన దూర్వాసుని సాదరంగా ఆహ్వానించిన కృపి, ఆయనకు సేవలు చేసి, తమ పేదరికాన్ని గురించి చెబుతూ, ఒక ముసలి ఆవు తప్ప ప్రపంచంలో మరే ఆస్తి లేదని, చివరకు పిల్లలు కూడా లేరని, ఇందుకు ఏదైనా మార్గాన్ని సూచించమని ప్రాధేయపడింది. ఆమె కష్టాలను విన్న దుర్వాసుడు, పూర్వం యశోద సంక్రాంతి పండుగనాడు స్నానం చేసి బ్రాహ్మణునికి పెరుగుదానం చేసి శ్రీకృష్ణుని కొడుకుగా పొందిందనీ, ఆమెను అలా చేయమన్నాడు.
వీరిలా మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజే సంక్రాంతి పండుగ అన్న విషయం గుర్తుకు తెచ్చుకున్న దుర్వాసుడు, కృపిని వెంటనే దగ్గరున నదికెళ్ళి నువ్వులపిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. అనంతరం తనకు పెరుగు దానం చేస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. కృపి దుర్వాసుడు చెప్పినట్లుగా చేస్తుంది. కొంతకాలానికి ఆమెకు ఓ కొడుకు పుడతాడు. అతడే ఆశ్వత్థామ.
ఈ రోజున ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, బంగారం, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరుక, గోవు మొదలైనవాటిని దానం చేయాలని అంటారు. ఈ రోజున శివుని ముందు నువ్వల దీపాన్ని వెలిగించడం, నువ్వులూ, బియ్యం కలిపి సిఉని పూజించడం చేయాలి. ఈ రోజున నువులను ఏదో ఒక రూపములో తినాలని అంటారు. శివునికి ఈరోజున ఆవునేతితో అభిషేకం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. ఈరోజున గుమ్మడికాయను కూరలో ఉపయోగించుకోవడం మంచిది.